కార్తీక మాసం మొదలైందంటే చాలు "శరణం అయ్యప్ప మమ్ము కావుమయ్యప్ప" అంటూ భక్త కోటి శబరిమల వైపు అడుగులు వేస్తుంటారు. ఎటుచూసినా "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ భక్తుల జయ జయ ధ్వానాలు కొండ మొత్తం ప్రతిధ్వనిస్తుంటాయి. ఏ వైపు విన్నా పవిత్ర దీక్షతో స్వామివారికి ఆత్మ నివేదన చేసుకునే భక్తుల అయ్యప్ప శరణుఘోషలే. అన్ని దారులూ స్వామి సన్నిధానానికి వెళ్లేవే అయినా, భక్తులు క్లిష్టమైన వాతావరణంలో...
భక్తులు శబరిమల ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల వివరాలను దిగువన చూద్దాం. ఎరుమేలి శబరిమలకి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించే ప్రదేశం ఎరుమేలి. మహిషి హతమైన ప్రాంతమైన ఈ ఎరుమేలి మత సామరస్యానికి కూడా పేరుగాంచింది...
శబరిమల దేవుడు ధర్మ షష్ఠ. అయ్యప్ప స్వామి ధర్మ షష్ఠలో ఐక్యమయ్యాడని పురాణ గాథ. తన భక్తుల కష్టాలను కడతేర్చే దేవుడిగా అయ్యప్ప స్వామిని పరిగణిస్తుంటారు. శబరిమల యాత్రను 41 రోజులపాటు దీక్ష పాటించిన అనంతరమే చేపడతారు. తొలిసారి యాత్ర చేపట్టేవారు, చాలాసార్లు యాత్ర చేసిన భక్తులు కూడా దీక్షను పాటించాల్సి ఉంటుంది. విధి నిర్వహణకోసం ఆలయంలో నియమితులైన అధికారులు, నెలవారీ పూజలకోసం మందిరాన్ని తెరిచినప్పుడు స్వామిని సందర్శించే భక్తులు సైతం దీక్ష చేపట్టాల్సిందేనని ఇటీవల ఆలయంలో కనుగొన్న జ్యోతిష్య సంబంధ గ్రంథాలు చెప్పాయి. మలయాళ మాసం వృశ్చికం తొలిరోజున అంటే సూర్య భగవానుడు సద్గతి మార్గాన పయనాన్ని ప్రారంభించిన సమయంలో శబరియాత్రకు దీక్ష మొదలవుతుంది...
కఠోరమైన నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మ నివేదన అయ్యప్ప దీక్షలోని ముఖ్యమైన విషయాలు. 41 రోజులపాటు మండల దీక్ష కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకోవటం ఈ దీక్ష ముగుస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ మనస్సునూ, శరీరాన్ని భగవంతుడికి అంకితం చేయాలి. ప్రతి ఒక్కరినీ భగవత్ రూపాలుగా తలచి అయ్యప్ప నామ జపంతో నిత్యం భజనల్లో పాల్గొనాల్సి ఉంటుంది.మలయాళ మాసమైన వృశ్చికం మొదటి రోజున శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది...